SS: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇవాళ పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు మంత్రి సవితను కలిసి తమ సమస్యలపై వినతులు అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు తమ విజ్ఞప్తులను ఆమెకు వివరించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యను సానుకూలంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మంత్రి భరోసా ఇచ్చారు.