SKLM: మందస మండలం కుంటికోట గ్రామంలోని ఓ పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉమెన్స్ సేఫ్టీ ప్రోగ్రాం లో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. మందస ఎస్సై కే కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. సమాజంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు, వేధింపులు పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలో తెలియజేశారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే బాధితులు వెనువెంటనే పోలీస్ శాఖకు సమాచారం అందించాలన్నారు.