కోనసీమ: రాజోలు మండలం పొన్నమండలోని బాణసంచా తయారీ కేంద్రాల్లో శనివారం సాయంత్రం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తహసీల్దార్ భాస్కర్ నేతృత్వంలో పోలీస్, ఫైర్ సిబ్బంది నిబంధనల అమలును పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. భద్రతా ప్రమాణాలు పాటించాలని పలు సూచనలు చేశారు.