HYD: ‘ప్లాస్టిక్ వద్దు.. పర్యావరణం ముద్దు’ అనే నినాదంతో ఆదివారం పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలు పెద్దఎత్తున ముందుకొచ్చారు. ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, కీసర చెరువుల పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను స్వచ్ఛందంగా శుభ్రం చేశారు. రణవీర్ సింగ్, శ్రీకాంత్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వల్ల నీటి వనరులు కలుషితమవుతున్నాయన్నారు.