PLD: పెదకూరపాడులో బుధవారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు మండుటెండలతో అల్లాడిన ప్రజలను, సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పలకరించింది. ఈ అకాల వర్షం వల్ల మిరప కోతకు వెళ్లిన వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అకస్మాత్తుగా కురిసిన వానతో రహదారులపై వెళ్తున్న వాహనదారులు తడిసి ముద్దయ్యారు. చేతికి వచ్చినపంట తడిసిపోతుందని ఆవేదన చెందారు.