NLR: నెల్లూరుకు చెందిన జేపీ సంజన ఏప్రిల్ 14న పార్లమెంట్లో జరిగే అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ప్రసంగించనున్నారు. ‘మై భారత్’ ద్వారా దేశవ్యాప్తంగా ఎంపికైన 12 మందిలో ఈమె ఒకరు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోటీల్లో సత్తా చాటి ఈ అరుదైన అవకాశం దక్కించుకున్నారు.