తిరుపతి నగరపాలక సంస్థలో వార్డుల సంఖ్యను 50 నుంచి 66కు పెంచుతూ జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేపట్టాలని కమిషనర్ మౌర్య అధికారులకు ఆదేశించారు. ఏప్రిల్ 9లోగా ముసాయిదా సిద్ధం చేసి, 10 నుంచి 16 వరకు ప్రజల అభ్యంతరాలను స్వీకరించనున్నారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఎటువంటి లోపాలు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.