AKP: సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 17న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ శంకర్ తెలిపారు. దివిస్ ల్యాబొరేటరీస్, యకోహామా టైర్స్, బ్లింకిట్ సంస్థలు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. 18–31 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన పది, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఎంఎస్సీ, ఫార్మసీ పూర్తి చేసిన నిరుద్యోగులు సర్టిఫికెట్ జెరాక్సులతో హాజరుకావాలని కోరారు.