ELR: పూళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని కోడూరుపాడులో శుక్రవారం ఆరోగ్య విస్తరణ అధికారి వై.వి. లక్ష్మణరావు ఆధ్వర్యంలో కీటక జనిత వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వ్యాధులు వ్యాపిస్తాయని తెలిపారు. “ఫ్రైడే-డ్రైడే” కార్యక్రమంలో భాగంగా ప్రతి శుక్రవారం నిల్వ నీటిని తొలగించి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు.