KRNL: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు బుధవారం తెలిపారు. రూ.1.36 లక్షల కోట్లతో ఏర్పడనున్న భారీ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదం చేస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్టుతో లక్ష మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ చొరవతోనే ఇది సాధ్యమైందని వెల్లడించారు.