PLD: ముప్పాళ్ళ మండలంలోని లంకెలకూరపాడు గ్రామంలో వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా అధికారుల ఆదేశాల మేరకు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని పంచాయతీ ప్రత్యేక అధికారి కేవీ శివ ప్రసాద్ (డిప్యూటీ ఎంపీడీవో) ప్రారంభించారు. గ్రామ ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉండేలా ఈ చర్యలు చేపట్టారు.