W.G: తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో ఇంటి పన్ను బకాయిలు రూ.17.26 కోట్లకు గాను ఇప్పటి వరకు రూ.11.13 కోట్లు వసూలు చేశారు. దాదాపు 65 శాతం పన్నులు వసూలు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసుబాబు బుధవారం సాయంత్రం తెలిపారు. మరో రూ. 4కోట్లు కుళాయి పన్నులు వసూలు చేయవలసి ఉందన్నారు. ఈ నెల 31లోగా చెల్లిస్తే ఆస్తి, ఖాళీ స్థలం పన్నుపై 50 శాతం వడ్డీ రాయితీ ఉంటుందన్నారు.