కృష్ణా: మెడికల్ మాఫియాను అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఏఐటీయుసీ జిల్లా కన్వీనర్ లింగం ఫిలిప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్లను కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఫిలిప్ మాట్లాడుతూ.. మెడికల్ మాఫియా వల్ల పేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని తెలిపారు.