తూ.గో: రాజానగరం నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి నన్నయ్య యూనివర్సిటీ సమీపంలో రూ.2.66 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ ఉపకేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్, MP పురందీశ్వరి, MLA బత్తుల బలరామకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఉపకేంద్రంతో ప్రాంతంలో దీర్ఘకాలిక విద్యుత్ సమస్యలు తగ్గనున్నాయని మంత్రి తెలిపారు.