PLD: బెల్లంకొండ మండలం వెంకటాయపాలెంలో నిర్వహించిన “ప్రజల వద్దకు ప్రవీణ్:100 రోజులు-100 గ్రామాలు” కార్యక్రమంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. 66వ రోజు గ్రామ ప్రజల అర్జీలు స్వీకరించి సమస్యలు విన్న ఆయన, త్వరిత పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం స్థానిక నాయకులతో గ్రామ సమస్యలపై చర్చించారు.