ATP: గుంతకల్లులోని పలు వార్డుల్లో శనివారం సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ.. రేపు సెలవు దినం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేస్తున్నామన్నారు. పించన్ల పంపిణీలో సాంకేతిక లోపం వస్తే తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు.