ATP: జిల్లా ప్రజల పాలిట సంజీవని లాంటి RDT సంస్థ పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. FCRA విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న పద్ధతి బ్రిటీష్ పాలనను తలపిస్తోందని విమర్శించారు. 50 ఏళ్లుగా విద్య, వైద్యం, క్రీడలు, మహిళా సాధికారత రంగాల్లో RDT అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.