నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ.. మహిళల కోసం ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను ప్రారంభించడానికి ఇక్కడ కలిసి ఉండటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, తదితరులు పాల్గొన్నారు.