VZM: సమగ్రశిక్ష ఉద్యోగుల సంక్షేమం కోసం తమ వంతు సహకారాన్ని అందజేయాలని ఉద్యోగుల సంఘం నాయకులు ఆరికతోట రామకృష్ణ, పి. సింహాచలం తెలియజేశారు. ఇవాళ నెల్లిమర్లలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమగ్రశిక్ష ఉద్యోగులకు ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమం నిధిని ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు.