PLD: మాచర్ల నియోజకవర్గం తాళ్లపల్లి జడ్పీ పాఠశాలలో రూ.30 లక్షలతో నిర్మించిన డైనింగ్ హాల్ను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డితో కలిసి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యాభివృద్ధిపై ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి హామీల అమలు దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.