VZM: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి చందనోత్సవం పర్వదినాన ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు స్వామివారిని మొదటిగా దర్శించుకున్నారు. ఈ సందర్బంగా స్వామివారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని కోరారు. దర్శించిన వారిలో MLA అదితి గజపతిరాజు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దంపతులు ఉన్నారు.