CTR: పూతలపట్టు మండలం పాలకూరు గ్రామంలో చెత్త సేకరణ కార్యక్రమాన్ని సెక్రటరీ లక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడుతూ.. నేటి నుంచి ప్రభుత్వం తరఫున ఐవిఆర్ఎస్ కాల్స్ వస్తాయని తెలిపారు. కాల్స్ వచ్చినప్పుడు స్పందించి తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు. ప్రజల సూచనలు సేవల మెరుగుదలకు ఉపయోగపడతాయని ఆమె వివరించారు.