KDP: సిద్ధవటం మండలం పొన్నవోలు గ్రామంలోని మామిడి శివారెడ్డి తోటలో కాపలాదారుగా ఉన్న యానికుల గణేష్(19 ) మతిస్థిమితం, అనారోగ్యంతో బుధవారం విషగుళికలు సేవించాడు. బందువులు సిద్ధవటం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లుగా ధృవీకరించారు. తండ్రి యాణికుల రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై హారిక తెలిపారు.