E.G: జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాలతో రాజమండ్రిలో మంగళవారం రాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 37 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ఇద్దరికి జైలు శిక్ష, 35 మందికి రూ. 10 వేల చొప్పున జరిమానా విధించినట్లు ట్రాఫిక్ DSP వై.శ్రీకాంత్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.