KRNL: కర్నూలు జిల్లా ఆదోని రూరల్ సీఐ నల్లప్ప, ఎస్సై మహేష్ కుమార్ నేతృత్వంలో పోలీసులు గురువారం డ్రోన్ సాయంతో ఇస్వీ కొండలలోని నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1,000 లీటర్ల నాటుసారా తయారీకి ఉంచిన బెల్లం ఊటను ధ్వంసం చేసి, 10 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఉదయ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు.