W.G: తాడేపల్లిగూడెంలోని 8, 14, 24 వార్డుల ప్రభుత్వ వసతి గృహాలను మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసు బాబు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం, పరిశుభ్రమైన తాగునీరు అందించాలని ఆదేశించారు. భోజనం నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతుల కల్పనలో ఎటువంటి లోటు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.