NDL: మహానంది మండలం తిమ్మాపురంలో ఏపీ మోడల్ స్కూల్లో ఏప్రిల్ 2, 4వ తేదీలలో క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాలను ప్రిన్సిపల్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. క్రీడల విభాగంలో విద్యార్థులు శారీరక దృఢత్వాన్ని, క్రీడా స్ఫూర్తిని చాటగా, సాంస్కృతిక విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరిని అలరించాయి. శనివారం కార్యక్రమం ముగింపులో పోటీల్లో బహుమతులు అందజేశారు.