బాపట్లలో మహిళ పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను పోలీసులు 10 నిమిషాల్లోనే ట్రేస్ చేసి తిరిగి అందించారు. బేతపూడి గ్రామానికి చెందిన ఇందిరాదేవి ఆటోలో ప్రయాణించే సమయంలో ఫోన్ మిస్ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు ఫోన్ను గుర్తించి బాధితురాలికి అప్పగించినట్లు CI రాంబాబు తెలిపారు.