NDL: యాగంటి ఉమామహేశ్వరస్వామి ఆలయాభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. సౌకర్యాలు లేక భక్తులు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి BC జనార్దన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు మంజూరు చేయించారు. వాహనాల పార్కింగ్ కోసం ఇటీవల 8ఎకరాలు అభివృద్ధి చేశారు. తాజాగా విడుదలైన రూ.5.8 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.