అన్నమయ్య: మదనపల్లి కలెక్టరేట్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన రావు, నరసింహారెడ్డి జీవితం యువతకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తొలి సాయుధ పోరాట యోధుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు.అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.