KRNL: అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుడు, ప్రముఖ హరికథా విద్వాంసుడు తాటికొండ సాయిరాం (53) శుక్రవారం గుండెపోటుతో మరణించారు. కర్నూలు నగరంలో జన్మించిన ఆయన, తన తండ్రి గణేశ్ భాగవతార్ వద్ద విద్యను అభ్యసించారు. సనాతన ధర్మవ్యాప్తికై రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు పొందారు. ఆయన మృతిపట్ల హిందూ ధార్మిక సంఘాలు సానుభూతిని ప్రకటించాయి.