సత్యసాయి: పరిగి మండలం కొడిగెనహల్లిలో 1 కోటి 80 లక్షల రూపాయలతో బీసీ బాలుర వసతి గృహ నూతన భవన నిర్మాణం కొరకు శనివారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత భూమి పూజ చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.