ప్రకాశం: కొండపి (M) కే.ఉప్పలపాడు నుంచి నిడమనూరు వెళ్లే రహదారి పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఈ రహదారిలో ప్రయాణం చేయాలంటే ఒళ్ళు గుల్లవుతుందని స్థానికులు అంటున్నారు. కే.ఉప్పలపాడు నుంచి టంగుటూరు మండలానికి కలిపే ఈ రోడ్డు నాలుగు కిలోమీటర్లు మేరా అడుగడుగునా గుంతలే దర్శనమిస్తున్నాయి అని తెలిపారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని వారు కోరుతున్నారు.