కృష్ణా: వేట్లపాలెం ఘటనపై మాజీమంత్రి కొడాలి నాని ఆదివారం స్పందించారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమన్నారు. 21 మంది ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రానికి తీరని లోటన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.