KRNL: ఆదోని ఎస్కేడి కాలనీలో ఇంటి స్థలం వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రత్యర్థులు తనపై దాడి చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితురాలు ఫాతిమా ఎమ్మెల్యే పార్థసారథికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎమ్మెల్యే ఇవాళ అధికారులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మహిళలపై దాడులు చేయడం హేయమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.