కోనసీమ: గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రవాస ఆంధ్రులతో మంగళవారం వీడియో కాల్ మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకున్నారు. ఇజ్రాయిల్-ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం, నెలకొన్న పరిస్థితులు వలన అక్కడ చిక్కుకున్న తెలుగు వారిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.