అనకాపల్లి మండలం కొత్తూరులో భగవాన్ అవతార్ మెహర్ బాబా 132వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. మెహర్ బాబా మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. మెహర్ బాబా భక్తురాలు మాజీ ఎంపీపీ గంగుపాం జలజ మాట్లాడుతూ.. ప్రేమ, సేవలతో లోక శాంతిని పొందవచ్చునని భగవాన్ అవుతారు మెహర్ బాబా సూచించారని పేర్కొన్నారు.