ప్రకాశం: భారతదేశంలో సామాజిక సమతుల్యత హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని మంత్రి స్వామి అన్నారు. తూర్పు నాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసిన నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు.