KDP: శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బద్వేల్ నియోజకవర్గానికి నిధులు కేటాయించకపోవడం దుర్మార్గమని సీపీఐ లిబరేషన్ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఎస్. చంద్రశేఖర్ విమర్శించారు. బద్వేలులోని భగత్ సింగ్ నగర్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమశిల వెనుక జలాల జీవోకు రూ.100 కోట్లు కేటాయించి గోపవరం, అట్లూరు, బద్వేల్ ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలని డిమాండ్ చేశారు.