సత్యసాయి: పెనుకొండలో ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొని, మాట్లాడారు. ఆడపిల్లలకు POCSO Act పై అవగాహన ఉండాలని సూచించారు. గుడ్ టచ్–బ్యాడ్ టచ్ గురించి తెలుసుకుని, ఎవరైనా అనుచితంగా ప్రవర్తించిన వెంటనే తల్లిదండ్రులకు తెలియజేయాలని తెలిపారు.