VSP: వీఎంఆర్డీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ఛైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ ప్రజల నుంచి 14 వినతులు స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకుని, ప్లానింగ్, ఎస్టేట్ తదితర విభాగాలకు వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వినతులపై సమగ్రంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.