PLD: వినుకొండలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తన కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వివరించగా, ఆయన స్వయంగా వినతి పత్రాలను స్వీకరించారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల సమస్యలపై పలువురు ఫిర్యాదులు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చేస్తామని అన్నారు.