SS: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో మంగళవారం ఆయుధపూజను నిర్వహించారు. సాయికుల్వంత సభామండపంలో సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం బంగారు రథం, సత్యసాయి వినియోగించిన కార్లను ప్రత్యేకంగా అలంకరించి ట్రస్టు సభ్యులు, ఆర్జే రత్నాకర్ తదితరులు ఆయుధ పూజను నిర్వహించారు.