సత్యసాయి: హిందూపురం మండలంలోని వెంకటాద్రి లే అవుట్లో జరిగిన దోపిడీ కేసులో అంతర్ రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో డీఎస్పీ కె.వి. మహేష్ అరెస్ట్ వివరాలు వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్కు చెందిన నిందితులు పటాన్ హైదర్ అలీ, ఇమ్రాన్ అలీ ఖాన్లను అరెస్టు చేసి 5 తులాలు బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.