BPT: చీరాల మున్సిపాలిటీ 31వ వార్డులో రూ.70 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శనివారం ఎమ్మెల్యే కొండయ్య శంకుస్థాపన చేశారు. అనంతరం కారంచేడు రోడ్డు నుంచి సెయింట్ ఆన్స్ హై స్కూల్ వరకు జరుగుతున్న డబుల్ రోడ్డు విస్తరణ పనులను ఆయన పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జోసెఫ్ డేనియల్, పలువురు అధికారులు పాల్గొన్నారు.