BPT: ఇసుకపల్లిలో వెలసిన శ్రీ భ్రమరాంబ సమేత చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధికి దేవాదాయ శాఖ నుంచి రూ. 40 లక్షలు మంజూరయ్యాయి. మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రత్యేక చొరవతో ఈ నిధులు కేటాయించినట్లు టీడీపీ నేత శివప్రసాద్ తెలిపారు. ఈ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన గురువారం భూమి పూజ నిర్వహించారు.