కృష్ణా: అవనిగడ్డలో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలోని ఈద్గా మైదానంలో ఖురాన్ గురువుతో కలిసి ఈదుల్ ఫితర్ ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం దానధర్మాలు చేశారు. ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, జనసేన జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేశారు.