SS: తిరుమలలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మడకశిర ఎమ్మెల్యే MS రాజు, శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి హనుమప్ప శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ప్రార్థించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కొంతసేపు గడిపి భక్తులకు అభివాదం చేశారు.