MHBD: కొత్తగూడ(M)బొత్తావానిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల కమిటీ కోశాధికారి పుల్సం సురేందర్ ఇటీవల అనారోగ్యానికి గురై మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ సంఘం జిల్లా అధ్యక్షులు భాస్కర్, గౌరవ అధ్యక్షులు నాగేశ్వరరావు మృతుడి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.