HYDలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రోత్సాహానికి కీలక అడుగులు పడుతున్నాయి. 25 ఆర్టీసీ డిపోలలో ఎలక్ట్రానిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. గ్రేటర్ పరిధిలో 2200 ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం అవసరమైన ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులను ఇప్పటికే అధికారులు పరిశీలించారు.